అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

Published: Tuesday July 26, 2022

మంచిర్యాల టౌన్, జూలై 24, ప్రజాపాలన : అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి , నిరుపేదలకు సహాయం చేస్తూ నిరంతరం ప్రజల్లో మమేకమవుతున్న మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ రావు అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఆదివారం ప్రేమ సాగర రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధికార ప్రతినిధి  చిట్ల సత్యనారాయణ , నస్పూర్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారు సుధాకర్ టీఆర్ఎస్ నేతల విమర్శలను ఖండించారు.  నడిపెల్లి విజిత్ రావు, ప్రేమ్ సాగర్ రావును విమర్శించే స్థాయి, హోదా రెండు లేవీని అన్నారు. ఎన్నికల్లో ఓటైపాలైనప్పటికీ నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజల మధ్య తిరుగుతున్న ప్రేమ్ సాగర్ రావును చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.కరోనా సమయంలో ప్రేమ్ సాగర్ రావు ఎంత సేవ చేసాడో ప్రజలకు తెలుసని అన్నారు. అసత్య ఆరోపణలు  మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ్ళ వేణు, మంచిర్యాల డిప్యూటి ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్, మాజిద్,మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు కౌన్సిలర్ సల్ల మహేష్, పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మెన్ వడ్డే రాజమౌళి,లలిత,తదితరులు పాల్గొన్నారు.