మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డికి అభినందనలు తెలిపిన గడ్డం రవికుమార్
Published: Friday July 15, 2022
మేడిపల్లి, జూలై 14(ప్రజాపాలన ప్రతినిధి)
నూతనంగా మల్కాజిగిరి ఏసీపిగా నరేష్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గురువారం అల్లు అర్జున్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సన్మానించి, పూల బోకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస ఉప్పల్ సీనియర్ నాయకులు రేపాక కుమార స్వామి, సూరం శంకర్, దేవేందర్, మణిధర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: