వర్షాలతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పై డిప్యూటీ మేయర్ పర్యటన

Published: Monday July 19, 2021
మేడిపల్లి, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ ఆదర్శనగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో నీరు నిలవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు నగర డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ఆదర్శ నగర్ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో వర్షం నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, వర్షం నీరు నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వరద ముంపు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి చేశారు. వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశామని డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తెలిపారు.