బోడుప్పల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి

Published: Thursday April 29, 2021
మేడిపల్లి, ఏప్రిల్28 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 2వ డివిజన్ కాకతీయనగర్ కాలనీలో 14 లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు పనులను నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి తో కలిసి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్  కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రజలకు మంచినీళ్లు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్, వైకుంఠ దమాలు వంటి సమస్యలను తీరుస్తూ, అభివృద్ధి పథంలో కార్పొరేషన్ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీరాల నర్సింహా, కాలనీ అధ్యక్షులు కోట్ల భాస్కర్, తెరాస నాయకులు జక్కల రాములు, నర్సింహారెడ్డి, కొత్త సాయి తేజగౌడ్, రమణారెడ్డి, లింగారెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.