వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి : జడ్పీ చైర్మన్
Published: Tuesday September 28, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : సెప్టెంబర్ మధిర నియోజవర్గ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచించారు జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించడం జరిగింది
Share this on your social network: