పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దాం
Published: Thursday August 05, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 4 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం నియోజకవర్గ సమావేశం జరిగింది. యంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రావుల వీరేశం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో శుక్రవారం రోజు యన్ టిర్ ట్రస్ట్ భవన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులై తిరిగి అధికారంలో కి తెచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పార్టీ పటిష్ఠ కోసం గతంలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలు. గురించి చర్చించారు. ఆరు యేండ్ల తెరాస పలనాలో పథకాల వైఫల్యాలు ఎతి చూపుతూ టీడీపీ పార్టీ ని బలోపేతం చేయగలమని నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జలమోని రవీందర్, మంచల్ మండల అధ్యక్షుడు సిహెచ్ చక్రపాణి, ఇబ్రహీంట్నంల మున్సిపాలిటీ అధ్యక్షుడు జక్క రాంరెడ్డి, టీడీపీ యువ నాయకులు మెట్టు దామోదర రెడ్డి, రంగారెడ్డి బిసిసెల్ అధ్యక్షులు పలసం బ్బుచ్చియా గౌడ్, టీడీపీ నాయకులు శ్రావణ కుమార్ చారీ, ప్రధాన కార్యదర్శి కొండ్రు కృష్ణ, మురళీ దర్ గౌడ్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: