మత్స్యగిరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

Published: Monday February 08, 2021

వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ ఆలయం దాతల సహకారంతో దినదినాభివృద్ది జరుగుతుందని, మంత్రుల సహకారంతో ఇంకా ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.అనంతరం ఆలయ పాలకవర్గం చైర్మన్ గా ముద్దసాని కిరణ్ రెడ్డి,సభ్యులుగా ఎక్కలదేవి శ్రీనివాస్,పోలేపెళ్లి బాలకృష్ణ, యార శ్రీశైలం,పోలేపాక భిక్షపతి, కాచమల్ల శేఖర్, కంపెళ్లి సత్తయ్య, జక్కుల మత్స్యగిరి, బరిశెట్టి మహేష్, బందారి వెంకటనర్సింహ,పాశం మహేందర్ రెడ్డి, సుంకే శమంత,వెలిమిటి యాదగిరి,కట్ట జ్యోతి,సుంకి శమంత, దేవాలయ సీనియర్ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు ఎక్సాఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో సురకంటి వెంకట్ రెడ్డి, చిట్టెడి వెంకట్ రాం రెడ్డి,చిట్టెడి జనార్దన్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, పనుమాటి మమత, తుమ్మల వెంకట్ రెడ్డి,గుర్రం లక్మా రెడ్డి,కీసర్ల సతిరెడ్డి, డేగల పాండరీ తదితరులు పాల్గొన్నారు.