శ్రీకాంత్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు..

Published: Friday December 24, 2021
వైరా, డిసెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్): గత 13 సంవత్సరాలుగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయం అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. గురువారం వైరా ఆర్సియం చర్చ్ రోడ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు సూతకాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ ఏసు క్రీస్తు ప్రభువు బోధించిన ప్రేమ మార్గం లో నడవాలని అన్నారు. అనంతరం జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ ఆర్థిక సహకారంతో వృద్ధులకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోనాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ధర్నా శేఖర్, డాక్టర్ కాప మురళి కృష్ణ, లగడపాటి ప్రభాకరావు, ఉండ్రు శ్యామ్ బాబు, కట్ల రంగారావు, దాసరి దానియేలు, డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణ మూర్తి, కౌన్సిలర్స్ మాదినేని సునీత, మరికంటి డెడికుమారి, బానోత్ లక్ష్మి భాయ్ మరికంటి వాసు దాస్ తదితరులు పాల్గొన్నారు.