సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published: Monday August 09, 2021
జగిత్యాల, ఆగస్టు 08 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 17 లక్షల 41 వేల రూపాయల విలువగల చెక్కులను టీఆరెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పంపిణీ చేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  పలు చికిత్సలకు ఆర్థికంగా నష్టపోయిన పేద ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించే ఉద్దేశంతో సీఎం సహాయనిది ద్వారా చెక్కులను పంపిణీ చేస్తున్నారని అన్నారు. అలాగే జగిత్యాలకు మెడికల్ కాలేజి ప్రకటించి ప్రజల చిరకాల కలను సాకారం చేశారని జగిత్యాల ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, దుమాల రాజ్ కుమార్, భోగ ప్రవీణ్, కౌన్సిలర్లు చదువుల తిరుపతమ్మ కోటేశ్వర, కూతురు రాజేష్, బొడ్ల జగదీష్, మల్లికార్జున్, కప్పల శ్రీకాంత్, వారణాసి మల్లవ్వ తిరుమలయ్య, పంబాల రాంకుమార్,క్యాదాసు నవీన్, చాంద్ పాషా, పిట్టా ధర్మరాజు, అల్లే గంగసాగర్, నాయకులు బండారి నరేందర్, బాలే శంకర్, అడువాల లక్ష్మణ్, కొలగాని సత్యం, దామోదర్ రావు, కూతురు శేఖర్, మేక పవన్, లవంగ రాజేందర్, రాచర్ల విజయ్, జెడి, బండారి విజయ్, గట్ల వంశీ, అసిఫ్, జిలాని, డాన్ శ్రీనివాస్, అభి శ్రీను, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు