జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన బీజేపీ జిల్లా నాయకుడు తొడుపునూరి వెంకటేశం

Published: Monday May 31, 2021

సిద్దిపేట, మే 31, ప్రజాపాలన ప్రతినిధి : నరేంద్రమోడీ భారత ప్రధానమంత్రిగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో బిజెపి నాయకులు తోడుపునురి వెంకటేశం తన నివాసంలో పత్రికా విలేకరులకు బియ్యము మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పాలన చేపట్టిన తర్వాత దేశం ఎంతో ఘనకీర్తి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అంబటిపల్లి శ్రీనివాస్ గారు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బోంగోని సురేష్ గౌడ్, బిజెపి నాయకులు శ్రీ పుల్లయ్య గారి వెంకట్ గౌడ్, కేమ్మసారం సంతోష్ కుమార్, నీలం దినేష్ పటేల్, వెల్ది కిరణ్ మరియు పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.