ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Thursday July 22, 2021
జగిత్యాల, జులై 21 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ముస్లిం సోదరి సోదరులందరికి జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని షాదిముబారక్ గురుకులాలు ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కోవిద్ నిబంధనాలు పాటిస్తూ బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ముస్లిం సోదరులందరు సంతోషంగా ఉండాలని జడ్పీ ఛైర్పర్సన్ వసంత ఆకాంక్షించారు.