కళ్యాణ లక్ష్మి పథకం దేశానికే ఆదర్శం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday February 21, 2023

బోనకల్, ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో రైతు వేదిక నందు మండలానికి చెందిన వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప పధకం అని రాష్ట్రం లో మధిర నియోజక వర్గం లో లక్షలాది కుటుంబాలకు భరోసాగా నిలిచిందని ఇటువంటి గొప్ప పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వనికి సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ , డిప్యూటీ తాసిల్దార్ సంగ్ శ్వేత, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, మండల వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్ ,బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ఆళ్ళపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, గోవిందపురం ఏ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, రామాపురం సర్పంచ్ తొండపు వేణు, రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, బంధం నాగేశ్వరరావు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.