మత్స్యగిరి ఆలయంలో ఈ నెల 25న స్వాతి కళ్యాణం

Published: Monday May 24, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గుట్ట పైన ఈ నెల 25వ తేదీన మంగళవారం రోజున నృసింహ జయంతి మరియు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణం అర్చకులచే అంత రంగికముగా మాత్రమే నిర్వహించబడును. Covid-19 కరోనా 2 వ దశ వ్యాప్తి నిరోధక చర్యల్లో ప్రభుత్వ జి ఓ ననుసరించి, తేదీ 30వ తేదీ వరకు లాక్ డౌన్ దృష్ట్యా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు భక్తులకు దేవాలయ ప్రవేశం అనుమతి లేదని, ఒక ప్రకటనలో కార్యనిర్వహణ అధికారికి కె రవికుమార్ తెలియజేశారు.