దివ్యా రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ

Published: Wednesday November 17, 2021
మేడిపల్లి, నవంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : సామాజిక సేవా దృక్పథంతో దివ్యా రెడ్డి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దివ్యా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, రాచకొండ కమిషనరేట్ సెక్యూరిటీ కౌన్సిల్ సోషల్ వెల్ఫేర్ చీఫ్ చల్లా దివ్యా రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో  గతవారం ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ లో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ (అర్ పి) లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, యూసిడి డైరెక్టర్ రమాదేవిల సమక్షంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో 150 మందికి ఉచితంగా కంటి అద్దాలను చల్లా దివ్యా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యా రెడ్డి మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన దివ్యా రెడ్డి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఉచిత సలహా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు  పేర్కొన్నారు.