స్వామిఅయ్యప్ప దేవాలయంఆలయంలో మండల పూజలు
Published: Saturday November 19, 2022
మధిర నవంబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో శుక్రవారం జరిగిన ఉదయాస్తమాన పూజల్లో మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మల్లాది వాసు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు స్వామి చెరుపల్లి శ్రీధర్ స్వామి మైనీడి జగన్మోహన్ రావు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: