పార్కు స్థలాల కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం

Published: Friday December 24, 2021

మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్  పరిధిలోని  అమూల్య, దివ్య నగర్ కాలనీలోని పార్కు స్థలాల కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి స్థానిక 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రామా వెంకటేష్ యాదవ్ తో  కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుర్రాల రామ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్లోని పార్క్ స్థలాల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముద్దం రాంచందర్, కాలనీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సత్యనారాయణ, రత్నాకర్, హరి, శ్రీనివాస్, ప్రసాద్ కాలనీ వాసులు పాల్గొన్నారు.