ప్రతి ఆదివారం.... ప్రజా సమస్య పరిష్కారం

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : కాలనీల సమస్యలను త్వరలో పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చిన స్థానిక కార్పొరేటర్. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 డివిజన్ కార్పొరేటర్ మోడల బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం లో భాగంగా శివాజీనగర్ కాలనీలో ఉన్న పెద్ద మనుషులు కాలని అధ్యక్షులు తో పాటు కలిసి మోడల బాలకృష్ణ పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ పెద్దలు పెద్దఎత్తున అక్కడ ఉన్నటువంటి సమస్యలు వివరించారు. ఎలక్ట్రిసిటీ పోల్స్, చిన్న చిన్న సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్య, త్రాగునీటి సమస్య, తీవ్రంగా ఉందని కాలనీవాసులు కార్పొరేటర్  దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ...... వీటిని వెంటనే ఒక నెల లోపల పరిష్కరిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ సమస్యలన్నీ కార్పొరేషన్ అధికారులతో వెల్లడించారు.  వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడిన తర్వాత కాలనీ పెద్దలకు ఒక నెల లోపల మీరు చెప్పినటువంటి సమస్యలన్ని  తీరుస్తానని చెప్పడంతో, కాలనీ వాసులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ కాలనీ అధ్యక్షులు శ్యామ్, కాలనీ సభ్యులు నాగరాజు, శ్రీనివాస్,  ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.