ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday October 28, 2022

బిజెపి నాయకుల వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం*

*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
*ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా?

*మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు కేంద్రం

*తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారు
*ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఆశ చూపారు.

*ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది
*బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారు
*ఇక నైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలి.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అని టిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు అల్వాల్ వెంకటరెడ్డి, మడుపు వేణుగోపాలరావు అన్నారు . తెలంగాణలో ఎమ్మెల్యేలను బిజెపి నాయకులు కొనాలని చూసిన దుర్మార్గపు చర్యకు నిరసనగా గురువారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమని,  అని ఎద్దేవా చేశారు.మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని తెలిపారు.తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారని, ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఆశ చూపారని అన్నారు. ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారని, ఇక నైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చింతం రాజేందర్ యాదవ్, టిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి షబ్బీర్ , ఏరుకొండ శంకర్, మస్తాన్, కొండు రవి, పి. మహేందర్, వనమాల రవీందర్, మజకిర్, గరిగే శేఖర్, ప్రభు, బోర్ర రమేష్, రెడ్డి మల్ల యాదయ్య, నరాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.