మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మహిళాా దినోత్సవం ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ కు చిరు సత్కారం చేసిన పోలీస్ శాఖ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు దేశంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మధిర సిఐ మురళి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధిర సర్కిల్ లో పనిచేస్తున్న మహిళా ఎస్ఐలను మహిళా కానిస్టేబుల్ను, మహిళా హోంగార్డులను శాలువా కప్పి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, పదిల పరుచుకుంటూ, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. చదువు, నైపుణ్యాలను వజ్రాయుధంగా ఉపయోగించుకొని మహిళలు అభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎస్ఐలు ప్రియాంక, భవాని కవిత, సతీష్ కుమార్ ప్రసాద్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు