గ్రామపంచాయతీలకు డిజిటల్ కీ ల పంపిణి.

Published: Saturday July 09, 2022
మధిర రూరల్ జూలై 8 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గ్రామపంచాయతీలకు డిజిటల్ కి పంపిణీ చేసిన ఎండిఓ విజయభాస్కర్ రెడ్డి
కేంద్రప్రభుత్వం ద్వారా విడుదల చేసే నిధులకు గాను మండలపరిషత్ మరియు గ్రామపంచాయతీలకు పి ఎఫ్ ఎం ఎస్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్  ద్వారా నిధులను డ్రా చేసుకొనుటకు గాను డిజిటల్ కీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఇకనుండి నేరుగా గ్రామపంచాయతీలకే కేంద్రం  నిధులు జమ అవుతాయి.  ఇట్టి డిజిటల్ కీస్ ని ఆయా గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు మధిర మండల పరిషత్  అభివృద్ధి అధికారి శ్రీ కుడుముల విజయభాస్కర్ రెడ్డి , ఎర్రుపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ  బిక్కంటి శ్రీనివాసరావు ,  ఎంపీఓ శ్రీ టివిఎన్ఎల్  శాస్త్రి చే పంపిణి చేయనైనది. ఇట్టి పంపిణి కార్యక్రమంలో మధిర మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మెండెం లలిత ,  రెండు మండలాల సర్పంచ్ , ఉప సర్పంచ్  మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.