యూత్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య 88 జన్మదిన వేడుకలు
Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మధిర యూత్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య 88వ జన్మదిన వేడుకలను స్థానిక సేవాసదనం మానసిక వికలాంగుల మధ్యలో ఘనంగా నిర్వహించారు. అనంతరం యూత్ క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ మాట్లాడుతూ. గుంటూరు జిల్లా లోని వేమూరు గ్రామంలో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారని, 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారని, ఇతడికి ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉన్న నాయకుడు అని అంతటి మహనీయుని జన్మదిన వేడుకలను మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ, మిరియాల వెంకటరమణ గుప్తా, సురేష్, కృష్ణమూర్తి, కృష్ణారావు, వేముల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: