రాష్ట్రస్థాయి సైనిక్ స్కూల్లో సీటు సాధించిన భరత్ టెక్నో స్కూల్ విద్యార్థి.
Published: Tuesday August 24, 2021
మధిర, ఆగష్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సైనిక్ స్కూల్లో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన భరత్ టెక్నో స్కూల్ విద్యార్థి శివ శంకర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత శీలం విద్యలత వెంకటరెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రవేశ పరీక్షలలో జనరల్ కేటగిరిలో రెండు సీట్లు మాత్రమే ఉండగా దానిలో ఒక స్థానాన్ని సాధించిన శివ శంకర్ కి విద్యాసంస్థల యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జింకలకోటేశ్వరరావు, రవీందర్ రెడ్డి, అజిం, నాగరాజు, భవాని, పావని, ప్రియాంక, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: