అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

Published: Wednesday April 05, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని సౌత్ స్వరూప్ 
నగర్లో  పలు అభివృద్ధి పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు. సౌత్ స్వరూప్ నగర్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్  రజితపరమేశ్వర్ రెడ్డి రూ.72 లక్షల నిధులను మంజూరు చేయించారు.
వరద సమస్య ముప్పు నుంచి తప్పించేందుకు కాలనీలో నాలా వైపు ఫెన్సింగ్ ,రిటర్నింగ్ వాల్ ను సైతం నిర్మాణం చేసినట్లుగా ఈ సందర్భంగా  కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గజ్జల వెంకట్ రెడ్డి ,తాటికొండ రమణ, బాకారం లక్ష్మణ్, బర్ల కృష్ణ, సల్ల ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,బసి రెడ్డి ,నర్సిరెడ్డి   ,సంపత్ రావు ,జల్ల వెంకటేశ్, అంజయ్య,శివ,గిరి , నరేష్ , రాజేష్,వెంకటస్వామి,వెంకటేశ్వర్లు, ప్రతాప్ రెడ్డి,రము, కృష్ణ స్వామి,బుచి రెడ్డి , నర్శిమరావు, ఈశ్వరయ్య, మహేష్, అనిల్, పాలడుగు లక్ష్మణ్, మశెట్టీ రాఘవేంద్ర, మంద సుమన్ రెడ్డి, పుజరి హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.