పీర్జాదిగూడ కోవిడ్ కేర్ సెంటర్కు 50 వేలు అందజేత

Published: Monday May 03, 2021
మేడిపల్లి, మే 2 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్కు 1వ డివిజన్ కమలానగర్ కాలనీకి చెందిన దాతలు శ్రీ లక్ష్మీ ఏజెన్సీ వారు నవీన్, రాజు, లక్ష్మన్, చందులు 50వేల రూపాయల చెక్కును పట్టణ మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతుల మీదుగా కోవిడ్ కేర్ సెంటర్కు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పిట్టల మల్లేష్, నాయకులు జావిద్ ఖాన్, చిరంజీవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.