వికలాంగులకు వయసు పైబడిన వారికి ఇంటి వద్దనే టీకాలు వేయాలి

Published: Saturday May 08, 2021

బెల్లంపల్లి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా బారిన పడకుండా వేసే వ్యాక్సిన్ టీకాలను వికలాంగులకు వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఇప్పించే ఏర్పాట్లు చేయాలనీ అంబేద్కర్ పూలే మహాజన సంగం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు గొడిశెల రసజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల, గ్రామాల్లోని, బెల్లంపల్లి పట్టణంలోని, వికలాంగులకు మరియు వయస్సు పైబడిన వారికి వారి వారి ఇళ్ల వద్దకు వచ్చి టీకాలు వేసే ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా వైద్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి వెంటిలేటర్ నిపుణులను నియమించాలని ఆయన కోరారు.