సాయి కిట్టి టీం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Friday March 10, 2023
మేడిపల్లి, మార్చి9 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ హేమానగర్ కాలనీ సాయి కిట్టి టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆటలు ఆడి, పాటలు పాడి ఉత్సాహంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయి కిట్టి టీం ఆధ్వర్యంలో వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి కిట్టి టీం ప్రతినిధులు మన్నే రేవతి, ఎస్. విజయ, చందన, శివరంజని, వి.రమాదేవి, నిర్మల రమా, శారద, లక్ష్మీ, పద్మ, శైలజ, పద్మ ,శ్రీవిద్య, అమరావతి, సుమతి, నాగరాణి, ప్రమీల, విజయ, కవిత, వరలక్ష్మి, కిరణ్మయి సునీత, బి పద్మ తదితరులు పాల్గొన్నారు.