కళ్యాణలక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Tuesday July 20, 2021
సారంగాపూర్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి చెందిన 53 మంది ఆడపడుచులకు 53 లక్షల 6వేల విలువగల కళ్యాణలక్ష్మీ చెక్కులను మరియు 13 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 3 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత ఎంపీడీఓ పుల్లయ్య ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహరెడ్డి మండల రైతుబంధు కన్వీనర్ కొల శ్రీనివాస్ మండల కో-ఆప్షన్ మెంబెర్ అమీర్ సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి ఢిల్లీ రామారావు కొండ శ్రీలత ఎడ్మల జయ  ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.