కళ్యాణలక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Tuesday July 20, 2021
సారంగాపూర్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి చెందిన 53 మంది ఆడపడుచులకు 53 లక్షల 6వేల విలువగల కళ్యాణలక్ష్మీ చెక్కులను మరియు 13 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 3 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత ఎంపీడీఓ పుల్లయ్య ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహరెడ్డి మండల రైతుబంధు కన్వీనర్ కొల శ్రీనివాస్ మండల కో-ఆప్షన్ మెంబెర్ అమీర్ సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి ఢిల్లీ రామారావు కొండ శ్రీలత ఎడ్మల జయ ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: