ఆర్థిక సాయం అందజేసిన డిసిసి అధ్యక్షులు కుంభం

Published: Friday June 04, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి కరోనా కాలంలో జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం కరోనా వ్యాధితో మరణించిన భువనగిరి సాక్షి టీవీ రిపోర్టర్ శానకొండ గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి 50 వేల రూపాయల నగదు భార్య మాధవికి అందజేశారు. ఇద్దరు కుమార్తెల చదువుల పై స్పష్టమైన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.