వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్

Published: Tuesday April 20, 2021
బీరుపూర్, ఏప్రిల్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): బీర్పూర్ మండలం కమ్మునూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో మరియు కొల్వాయి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత ప్రారంభించారు. అనంతరం కొల్వాయి గ్రామంలో శ్రీరామ ఆలయంలో డిఎంఎఫ్టి నిధులతో 9.20 లక్షలతో నిర్మించిన కళ్యాణ మంటపాన్ని జడ్పీ చైర్ పర్సన్ వసంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు కెడిసిసి డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు ఏసు బందెల మరియా రాంచంద్రం ప్యాక్స్ చైర్మన్ నవీన్ నారపాక రామరమేష్ మహిపాల్ రెడ్డి కోలుముల రమణ ముక్క శంకర్ పర్వతం రమేష్ ఘర్షకుర్తి రమేష్ బోడ సాగర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.