వాణి నగర్ పద్మశాలి పోచమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణి

Published: Monday July 04, 2022

జగిత్యాల, జూలై 03 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో పోచమ్మ బోనాల కార్యక్రమంలో  మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ శ్రావణిప్రవీణ్
పాల్గొన్నారు. చైర్పర్సన్ మాట్లాడుతూ  పోచమ్మ తల్లి కృప కటాక్షము అందరి పై ఎళ్లప్పుడు ఉండాలని జగిత్యాల పట్టణం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మొదటిసారి గా పద్మశాలి కులబంధావులు అందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది  అని తెలుపినారు. ఈ కార్యక్రమంలో వారివెంట కౌన్సిలర్స్ దాసరి లావణ్య, గుర్రం రాము, జుంబర్తి రాజుకుమార్, అల్లే గంగసాగర్, వాణి నగర్ పద్మశాలి కమిటి సభ్యులు మంచాల శ్రీనివాస్, చేటపెళ్లి గణేష్, చక్రపాణి, కొండ లక్ష్మన్, పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు గౌరి శ్రీనివాస్, మ్యానపురి. శ్రీనివాస్ రవిచంద, అరుముళ్ల పవన్ పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.