మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శన

Published: Saturday July 23, 2022

మేడిపల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి)

హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శను శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన హబ్సిగూడ షోరూంలో 22 నుండి 25 తేదీ వరకు నిర్వహిస్తామని షోరూమ్ హెడ్ అహ్మద్ సోఫీ తెలిపారు. 22 క్యారెట్ల పాత బంగారం మార్పిడి పై జీరో పర్సెంట్ తగ్గింపును పొందవచ్చునని తెలిపారు.