ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించిన వార్డు మెంబర్
Published: Wednesday November 02, 2022
శంకరపట్నం నవంబర్ 01 ప్రజాపాలన ప్రతినిధి:
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థలంలో వార్డ్ మెంబర్ మూల వేద షెడ్డు నిర్మించిందని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి ఆరోపించారు.ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ స్థలంలో అందరూ తాత్కాలిక షెడ్డులు నిర్మించారని, కానీ ఈ వార్డు మెంబర్ మూలవేద పక్కా షెడ్డును నిర్మించిందని అయన అన్నారు.దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. తక్షణమే మూలవేదపై చర్యలు తీసుకొని అక్రమ షెడ్డును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థలంలో వార్డ్ మెంబర్ మూల వేద షెడ్డు నిర్మించిందని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి ఆరోపించారు.ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ స్థలంలో అందరూ తాత్కాలిక షెడ్డులు నిర్మించారని, కానీ ఈ వార్డు మెంబర్ మూలవేద పక్కా షెడ్డును నిర్మించిందని అయన అన్నారు.దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. తక్షణమే మూలవేదపై చర్యలు తీసుకొని అక్రమ షెడ్డును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Reply
Forward
|
Share this on your social network: