జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఎంపిపి అరిగెల మల్లికార్జున్

Published: Thursday May 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా మే18 ప్రజాపాలన, ప్రతినిధి) : జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఎంపీపీ మల్లికార్జున్ అన్నారు. బుధవారం మండలంలోని తుంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకోన్నారు. అనంతరం ఎంపీటీసీ మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అని కల్పించాలని సూచించారు. కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.
 పల్లె ప్రగతి పనులలో అధికారులు అలసత్వం వహించకుండా ఉండాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్షలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి పనులలో అలసత్వం వహించకుండా  ఉండాలని, పనులు పకడ్బందీగా చేయడంతోపాటు నాణ్యతతో కూడి ఉండాలని తెలిపారు. అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, ఎంపీడీవో శశికళ, ఏపీఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నాడు.