కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరం లాంటి : మంత్రి మల్లారెడ్డి
Published: Monday August 09, 2021
మేడిపల్లి, ఆగస్టు 08 (ప్రజాపాలన ప్రతినిధి) : కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చి రెడ్డి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ డివిజన్లోని బయ్యనా నగర్ శారదకు, ఇంద్రనగర్ ఉమారాణికి కల్యాణ లక్ష్మీ చెక్కులను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద ప్రజల యువతి వివాహాలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు.
Share this on your social network: