హుజూర్బాధలో ఉద్యమ నేత కు ఊరూరూ నీరాజనం

Published: Thursday October 28, 2021
బాలాపూర్:అక్టోబర్ 27, ప్రజాపాలన (ప్రతినిధి) : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చివరి రోజున పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో రంగారెడ్డి జిల్లా నాయకులు విస్తృత ప్రచారం చేశారు. 20 రోజులుగా ఆ గ్రామంలో గడప గడప తిరిగి ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్ల వేలాది అభిమానాన్ని చాటుకున్నారు. 60వ బూత్ స్థాయి ప్రచార బాధ్యతలు తీసుకొని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లు చెప్పిన నాయకులు ఈటెల రాజేందర్ గెలిపుపై వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో ఈటెలకు... ఎవరు ఎదురు లేరని ప్రజలు పలువురు చెప్పారు. 60వ బూతు స్థాయిలో ఉన్న ప్రజలందరికి భాజపా నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.