అనాధ అభాగ్యుల మధ్య జన్మదిన వేడుకలలో మనస్సు సంతృప్తి

Published: Wednesday August 11, 2021
బాలాపూర్: ఆగస్టు10, ప్రజాపాలన ప్రతినిధి : అనాధలకు, అభాగ్యులకు ప్రతి ఒక్కరూ సహాయసహకారాలు అందించాలని 5వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ జీ.శివారెడ్డి అన్నారు. బడంగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్న నాదర్గుల్  గ్రామం లో ఉన్నటువంటి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అభాగ్యుల మధ్య కార్పొరేషన్ బిజెపి ఉపాధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్ జి.శివారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ... సంతోషకరమైన వేడుకల్లో పదిమందికి పంచాలని సంకల్పంతో నా పుట్టినరోజు అభాగ్యుల మధ్య జరుపుకుంటుంటే ఆనందంగా ఉందని అన్నారు. మతిస్థిమితం లేని అభాగ్యుల అనాధలకు విశేష అన్నదానం చేయడంలో మనసుకు సంతృప్తిగా ఉందని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... ఆశ్రమ అనాధల మధ్య జరుపుకున్న పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమవాసులు, ఆశీస్సులతో మీ జీవితం, నిత్యం, ఆనందంగా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, సహాయ సహకారాలు అందించిన మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు పొందిలని, ఆశ్రమ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, కార్పోరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, డి.మల్లికార్జున్, శ్రీనివాస్, కాలని వాసులు, తదితరులు, స్నేహితులు పాల్గొన్నారు.