ఘనంగా పోరండ్ల బీరప్ప మహంకాళమ్మ ఆషాడం మాస బోనం మహోత్సవం
Published: Thursday July 28, 2022
కరీంనగర్ జూలై 26 ప్రజాపాలన :
కరీంనగర్ లోని రేకుర్తి శివారులోని పోరండ్ల బీరప్ప మాంకాలమ్మ దేవాలయంలో పస్క బీరయ్య ఆషాడమాస బోనం ఉత్సవాలు ఏనుగుల వంశస్థులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.బోనాల ఉత్సవంలో భాగంగా విద్యానగర్ నుండి రేకుర్తి వరకు బోనాలతో ఏను గుల వంశస్థులు తరలివెల్లి దేవాలయంలో బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, బీరప్ప ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల వెంకటి, ఎనుగుల లచ్చయ్య, ఏనుగుల ఐలయ్య, ఏనుగుల రాజు,ఏనుగుల వంశస్థులు మరియు కుటుంబ సభ్యులు, పిల్లలు, మహిళలు ,బిర్ల కళాకారులు పాల్గొన్నారు.
Share this on your social network: