అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావ్వొద్దు:చైర్ పర్సన్ కోలన్ రోజా బాల్ రెడ్డి

Published: Monday May 24, 2021
బొల్లారం, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : బొల్లారం మున్సిపాలిటీలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. అందులో భాగంగా 8వ వార్డ్ వైస్సార్ కాలనీలో ఇంటింటా ఫీవర్ సర్వే లో పాల్గొన్న చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు, కరోనా పాజిటివ్ ఉన్నవారికి తగు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ప్రజలందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా పోషకాలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి సబిత, ఆశా వర్కర్ అంజలి, అంగన్వాడీ ఆయా మాధురి తదితరులు పాల్గొన్నారు.