జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా హైస్కూల్లో విద్యార్థులకు క్విజ్ వ్యాస రచన పోటీలు
Published: Monday January 23, 2023
అశ్వరావుపేట మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్,వ్యాసరచన, వకృత్వ, పోటీలను జూనియర్ సీనియర్ ఆధారంగా నిర్వహించారు .ఈ సందర్భంగా మొదటి ద్వితీయ బహుమతులు వచ్చిన వారిని ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు ఈనెల 23వ తారీఖున పాల్వంచలోని బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుందని ఆర్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్ ఐ టి క్రిష్ణ, విఆర్ఎ మహేంద్ర,హెచ్ యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: