ఫిబ్రవరి 12న జరిగే విద్యార్థుల గర్జనను విజయవంతం చేద్దాం

Published: Tuesday January 11, 2022
ఎర్రుపాలెం జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: ఫిబ్రవరి 12న హైదరాబాద్లో జరిగే విద్యార్థుల గర్జనను విజయవంతం చేయండి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ. ఎర్రుపాలెం మండల ఎం ఎస్ పీ కార్యాలయంలో జరిగిన మాదిగ విద్యార్థుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపూరి వెంకటేశ్వర మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 12 హైదరాబాదులో జరిగే విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలని, ప్రతి గ్రామం నుండి విద్యార్థుల గర్జనకు వేలాదిగా తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభాకర్ మాదిగ, ఎరుపాలెం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు గుండ రామయ్య మాదిగ, మేకల ఓరయ్య మాదిగ, తమ్మి మాదిగ, దేవరకొండ వెంకటేశ్వర మాదిగ, సునీల్ మాదిగ, శ్యామ్ మాదిగ, వెంకటరత్నం మాదిగ, మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.