ప్రతి కాలనీనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్

Published: Friday June 18, 2021

అమీన్పూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నితీశా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.