అన్నారుగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన సర్పంచ్ మారెళ్ల మమత..

Published: Thursday January 27, 2022
తల్లాడ, జనవరి 26 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఠామేస్త్రి జీ. కిసింది ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆమె హాజరై అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాగ్యమ్మ, సెక్రెటరీ వేణు, నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, దుగ్గినేని గోపయ్య, తాళ్ల జోసెఫ్, కొత్తపల్లి దానయ్య, ముఠా సభ్యులు పాల్గొన్నారు.