ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి ** ఎమ్మార్పీఎస్ నాయకుడు కేశవ్ రావు **

Published: Friday September 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 21 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాకు చెందిన బీసీ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం అంక్సాపూర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పి, జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ రావ్ మాదిగ మాట్లాడుతూ మన ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టడం మన అదృష్టం అని అన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాట ఉద్యమంలోనూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాట ఉద్యమంలోనూ, తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ మలిదశ ఉద్యమంలో, పోరాటాలు చేసిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో 95వ సమయంలోనూ ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసిన గొప్ప నేత అన్నారు.1952 సంవత్సరంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అన్ని వర్గాల సమస్యల సాధనకై పోరాటం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి అంజన్న, యశోద, తిరుపతి, బండి కుమార్, సాలక్క, సులోచన, తదితరులు పాల్గొన్నారు.