అనాథ వృద్ధుల ఆశ్రమంను ఆదుకున్న రోటరీ క్లబ్ ఆఫ్ చిట్యాల
Published: Thursday December 02, 2021
యాదాద్రి- భువనగిరి జిల్లా 30 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : రోటరీ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో మంగళవారం నాడు నార్కట్ పల్లి మండల కేంద్రంలోని "అనాథ వృద్ధుల ఆశ్రమం" లో రోటరీ చిట్యాల అధ్యక్షుడు మందడి జనార్దన్ రెడ్డి దాతృత్వంలో రెండు క్విoటాల బియ్యం డా.ఎంపల్ల బుచ్చిరెడ్డి చైర్మన్, న్యూ క్లబ్స్ తెలంగాణ రీజియన్, మందడి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు నూతనగంటి కవిత కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ 2022-23 చిట్యాల క్లబ్ కార్యదర్శి తీగల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు మేడి ఉపేందర్, కోశాధికారి దేవరపల్లి భగవంత రెడ్డి, భువనగిరి పోర్ట్ కార్యదర్శి జిట్ట భాస్కర్ రెడ్డి,సభ్యులు కొలను చెలిమి జంగయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత ఇచ్చామని కాదు... ఇతరుల అవసరాన్ని గుర్తించి మంచి మనసుతో చేసే ఏలాంటి సహాయం మైన గొప్పదని అలాంటి ఆలోచన రావడమే గొప్ప అని గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆశ్రమ వాసులు సహృదయంతో ముందుకొచ్చే దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: