రంగాపూర్ లో ప్రభుత్వ భూమిని కాపాడండి

Published: Tuesday February 28, 2023
* జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కి ఫిర్యాదు చేసిన వైఎస్ ఆర్ టిపి నాయకులు
వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని రియాల్టర్ల నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వైఎస్ ఆర్ టిపి నాయకులు పరిగి నియోజకవర్గ కో ఆర్డినేటర్ కోళ్ళ యాదయ్య కావలి వసంత్ కుమార్ గోవర్ధన్ రెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిధిలోగల పరిగి నియోజకవర్గానికి చెందిన రంగాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 18లో గల 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్లు కబ్జా చేశారని స్పష్టం చేశారు. అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని రియల్టర్లకు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కంచె చేనును మేసిన విధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూమిని రియల్టర్లకు పట్టా చేసి ఇవ్వడం క్షమించరాని నేరం అన్నారు. భూ బకాసురుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి భూక్రమణచేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.