మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలి: జడ్పీటీసీ రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం

Published: Tuesday March 09, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, మార్చి 08, ప్రజాపాలన: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని జడ్పీటీసీ వాగబొయిన రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. సోమవారం 121వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో రోజురోజుకు యువతులపై, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయని వాటిని సమూలంగా అరికట్టినప్పుడే మహిళలకు సమాన గౌరవం, సమానత్వం ఉంటుందన్నారు.ఒక స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఉంటూ ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుందని అలాంటి స్త్రీలను గౌరవించడం మనందరి బాధ్యతన్నారు.కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతరాములు, ఉప సర్పంచ్ మానాల ఉపెందర్, ఎన్డీ నాయకులు యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.