పౌరులు ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత సురభి వాణిదేవిదే

Published: Tuesday March 09, 2021
-కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ పలువురు గ్రాడ్యుయేట్ ఓటర్ల ఇంటికి వెళ్లి, పట్టభద్రులను కలసి వారి యొక్క అమూల్యమైన పట్టభద్రుని ఓటును తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని సురభి వాణిదేవికి వేసి గెలిపించాలని అభ్యర్థిచారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని సురభి వాణిదేవి పట్ల అనూహ్య అనుకూల స్పందన గ్రాడ్యుయేట్ ఓటర్లు కనబరుస్తున్నారని అన్నారు. అత్యధిక విద్యావంతురాలు, ఎందరినో విద్యావంతులుగా, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత సురభి వాణిదేవికి ఉందని అన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు తెరాస అభ్యర్థిని సురభి వాణిదేవి పట్ల మంచి అభిప్రాయంతో ఉండటం తెరాస విజయానికి మరో మెట్టు అని పేర్కొన్నారు.