అటవీ అధికారులకు మద్దతుగా సామిల్ అసోసియేషన్ బంద్ ** సామిల్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీధర్ *

Published: Monday November 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 27 (ప్రజాపాలన, ప్రతినిధి) : భద్రాద్రి కొత్తగూడెం చంద్రుకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాస్ రావు హత్యను నిరసిస్తూ అటవీ అధికారులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని సామిల్స్ టింబర్ డిపో యజమానుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి మురళీధర్, ఇరుకుల్ల ఆంజనేయులు,పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారి శ్రీనివాస్ రావును గొంతు కోసి చంపడం దారుణం అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అనార్థం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.