పి.డి.ఎస్ బియ్యం స్వాదీనం చేసుకున్న ఎస్సై సతీష్.

Published: Monday January 17, 2022
జన్నారం రూరల్, జనవరి 16, ప్రజాపాలన : మండలంలోని రేండ్లగూడ వద్ద బాదావత్ రాజ్ కుమార్ అనే వ్యక్తి టాటా మేజిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర క్వింటాళ్ల పి.డి.ఎస్ బియ్యాన్ని శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టుకుని వాహనం ను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి.డి.ఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేసిన, నిలువ ఉంచిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు చట్టవ్యతిరేకమైన చర్యలు అరికట్టేందుకు పోలీసులకు సహాకరించాలని కోరారు. ఐతే బదిలీ పై మండలానికి వచ్చిన ఎసై విధుల్లో చేరిన మొదటి రోజే అక్రమంగా తరలిస్తున్న పి.డి.ఎస్ బియ్యాన్ని పట్టుకోవడంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసేవారికి ఒక హెచ్చరిక జారీ చేసినట్లు అయ్యిందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.