అంత్యక్రియలకు ఆర్థిక చేయూత

Published: Thursday September 30, 2021
పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ నియోజక పరిధిలో గల మర్పల్లి మండలానికి చెందిన పట్లూరు గ్రామంలో బుధారం రాములు మృతిచెందాడని గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధారం రాములు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశామని పేర్కొన్నారు. పట్లూరు గ్రామంలోని ఎస్సీ వసతి గృహంలో పనిచేస్తున్న బుధారం రాములు అనారోగ్యంతో స్వర్గస్తులైనారని చెప్పారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ మృతుని అంత్యక్రియలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎస్ కెఆర్ ట్రస్ట్ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి రూ. 5000లు, ఎంపీటీసీ మంజుల మహేష్ రూ. 2000 లు అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.